పదేళ్ల బాలిక అదృశ్యం… చెరువులో మృతదేహం

murder
Medchal girl :తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో అదృశ్యమైన 10 సంవత్సరాల చిన్నారి ఘటన తీవ్ర విషాదాంతమైంది. గురువారం స్కూల్కు వెళ్లిన చిన్నారి.. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మరణించింది. చిన్నారి మృతదేహాన్ని దమ్మాయిగూడలోని అంబేడ్కర్ చెరువులో గుర్తించారు. అయితే చిన్నారిని ఎవరైనా హత్యచేశారా లేక ప్రమాదవశాత్తు మరణించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Medchal girl : ఎన్టీఆర్ నగర్కు చెందిన ఇందు నాలుగో తరగతి చదువుతోంది. గురువారం ఆమె తండ్రి స్కూల్ వద్ద విడిచిపెచ్చి వెళ్లారు. అయితే కాసేపటికే బాలిక అదృశ్యం అయింది. బ్యాగ్ను స్కూల్లోనే విడిచిపెట్టి పక్కనే ఉన్న పార్క్ వద్దకు వెళ్లినట్లు తోటి విద్యార్థులు టీచర్కు తెలిపారు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు స్కూల్ పరిసరాల్లో తీవ్రంగా గాలించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా… చిన్నారి రోడ్డుపై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టగా.. సమీపంలోని దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.